ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ ( ట్విట్టర్) లోఅత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎక్స్ లో యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్క్ను దాటింది. ప్రధాని నరేంద్ర మోడీ (95.1 మిలియన్ ఫాలోవర్లు), హోం మంత్రి అమిత్ షా (34.4 మిలియన్ ఫాలోవర్లు) యోగి కంటే ముందున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 27.3 మిలియన్ల ఫాలోవర్లతో యోగి కంటే వెనుకబడి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు 19.1 మిలియన్ల మంది, రాహుల్ గాంధీకి 24.8 మిలియన్ల మందిఫాలోవర్లు ఉన్నారు.
యోగి తన పని తీరు మరియు వేగవంతమైన నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. 2019 జనవరిలో ప్రారంభమైన యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ ఖాతా ప్రస్తుతం దేశంలో సీఎంలలో అత్యధిక మంది అనుచరులను కలిగి ఉన్న వ్యక్తిగత అధికారిక ఖాతాగా మారింది.