పాక్‌‌‌‌‌‌‌‌ను ఓడించి సెమీస్‌‌‌‌‌‌‌‌కు ఇండియా

పాక్‌‌‌‌‌‌‌‌ను ఓడించి  సెమీస్‌‌‌‌‌‌‌‌కు ఇండియా


మాలే: సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్‌) అండర్–-20 చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ టీమిండియా అద్భుత ఆటతో ఆకట్టుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3–-0 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ను చిత్తుగా ఓడించింది.  ఈ గెలుపుతో ఇండియా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకోగా.. పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మూడో నిమిషంలోనే  విశాల్ యాదవ్ గోల్ కొట్టగా.. 64వ నిమిషంలో ఓమాంగ్ దోదుమ్ హెడ్డర్‌‌తో రెండో గోల్​ అందించాడు. 88వ నిమిషంలో  లభించిన పెనాల్టీని దోదుమ్ గోల్‌‌‌‌‌‌‌‌గా మార్చడంతో ఇండియా విజయం అందుకుంది. దోదుమ్ ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. గ్రూప్ దశలో ఇండియా తన తర్వాతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 28న బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది.