కిలాడీ లేడీ..పెళ్లి పేరుతో రూ.11 కోట్లు టోకరా

కిలాడీ లేడీ..పెళ్లి పేరుతో రూ.11 కోట్లు టోకరా

పెళ్లి పేరుతో ఓ యువతి  రూ.11 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌ బాచుపల్లిలో జరిగింది. విలాసాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా అనే మహిళ… నకిలీ ఐపీఎస్‌ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి అనే వ్యాపారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. అతని దగ్గర నుంచి రూ.11 కోట్లు తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలుసుకున్న వీరారెడ్డి పోలీసులను అశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు.. శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి రూ.6కోట్ల విలువైన ఆస్తులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు.