బీజేపీ ఓటమి ఖాయమైంది : రాహుల్ గాంధీ

బీజేపీ ఓటమి ఖాయమైంది : రాహుల్ గాంధీ
  • అందుకే మోదీ కొత్త డ్రామాలు

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఓటమి ఖాయమైందని, అందుకే ఆయన కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన గురువారం ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు. లోక్ సభ ఎన్నికలు మోదీ చేజారుతున్నాయి. ఇక ఆయన ప్రధాని కాలేరు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు. రానున్న నాలుగైదు రోజులు జనమంతా అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. 

ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నది. జూన్ 4న మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. మన దేశంలో నిరుద్యోగమే అతిపెద్ద సమస్య. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోదీ మోసం చేశారు. మళ్లీ ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ యువత మోసపోవద్దు. మోదీ మాటలు నమ్మవద్దు” అని రాహుల్ కోరారు.