రాహుల్ గాంధీపై ఈసీకి అథవాలె ఫిర్యాదు

రాహుల్ గాంధీపై ఈసీకి అథవాలె ఫిర్యాదు
  • రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందన్న వ్యాఖ్యలపై అభ్యంతరం 

ముంబై: కాంగ్రెస్‌‌‌‌ అగ్రనేత రాహుల్‌‌‌‌ గాంధీపై కేంద్ర మంత్రి రాందాస్‌‌‌‌ అథవాలె ఎలక్షన్​కమిషన్​కు ఫిర్యాదు చేశారు. బీజేపీ మళ్లీ వస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తుందని రాహుల్‌‌‌‌ తరచూ ప్రకటనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాహుల్ మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. 

గురువారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ చాలాసార్లు తోసిపుచ్చారని తెలిపారు. అయినా రాహుల్ పదేపదే అదే ప్రకటన చేస్తున్నారన్నారు. అందుకే ఆయన మళ్లీ అలాంటి ప్రకటనలు చేయకుండా అతనిపై చర్యలు తీస్కోవాలని   కోరానన్నారు.