యాదాద్రి జిల్లాలో అవగాహన ర్యాలీ : యువతా మేలుకో …ఆత్మహత్యలు మానుకో

యాదాద్రి జిల్లాలో అవగాహన ర్యాలీ : యువతా మేలుకో …ఆత్మహత్యలు మానుకో

వలిగొండ: కష్టాలకు ఆత్మహత్యలే పరిష్కారంకాదని యువకులు ధైర్యంగా ముందుకెళ్లాలని సూచిస్తూ.. ర్యాలీ నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామ యువకులు. వెలువర్తి గ్రామంలో  ఆరు నెలల్లో ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కలత చెందిన ఆ ఊరి యువకులందరూ యువతలో ఆత్మస్థైర్యం, బతుకుపై అవగాహన కల్పించడం కోసం శుక్రవారం ఉదయం ఊరిలో ర్యాలీ నిర్వహించారు. అమ్మా నాన్నల ఆశయాలు సాధించటం కోసం యువత బతకాలని యువతలో ధైర్యాన్ని నింపారు.

ఉద్యోగం రాలేదని, అమ్మానాన్నలు తిట్టారని, ప్రేమ వ్యవహారం ఇతర సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని నినాదాలు చేశారు. యువతా మేలుకో …ఆత్మహత్యలు మానుకో.., అమ్మా నాన్న లు ఉండగా ఆత్మహత్యలు చెడ్డరా.. అంటూ యువతలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.