కూకట్పల్లిలో గంజాయి సేవిస్తున్న యువకులు అరెస్ట్

కూకట్పల్లిలో గంజాయి సేవిస్తున్న యువకులు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: గంజాయి సేవిస్తున్న ముగ్గురిని బాలానగర్​ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్​చేశారు. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో సాహిత్​, వికాస్​, సుమంత్​ అనే యువకులు గంజాయి తాగుతున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్​ చేశారు. వారి వద్ద గంజాయి, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకుని కూకట్​ పల్లి పోలీసులకు అప్పగించారు.