కారేపల్లి, వెలుగు: విద్యుత్ షాక్ తో గ్రామపంచాయతీ కార్యదర్శి చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన లకావత్ సురేశ్(32) ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామపంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. సురేశ్ అత్తగారి గ్రామమైన కారేపల్లి మండలం మంగలితండాలో ఉంటూ తిమ్మారావుపేటలో డ్యూటీ చేస్తున్నాడు. ఆదివారం ఇంటిలో ఉన్న ఇన్వర్టర్ ను పక్క గదిలోకి తరలిస్తుండగా, విద్యుత్ షాక్ కు గురై చనిపోయాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
