డిసెంబర్ 3తో కేసీఆర్ కు ఎండ్ కార్డు పడబోతుందన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా వైఎస్సార్ టీపీ పనిచేసిందన్నారు. కేసీఆర్ పాలన అంతం కావాలని..ఓట్లు చీలకూడదనే కాంగ్రెస్ కు మద్దితిచ్చామన్నారు. తాము పోటీ చేస్తే ప్రతీ నియోజకవర్గంలో 5 నుంచి 10 వేల ఓట్లు వచ్చేవన్నారు తెలంగాణలో తమకు గెలిచే సత్తా లేకున్నా ఓడించే సత్తా ఉందన్నారు షర్మిల. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్ కు సూట్ కేసును గిఫ్ట్ గా ఇచ్చారు షర్మిల.
తన ఓటమిని కేసీఆర్ ప్రజా తీర్పుగా భావించాలని.. మిగతా ప్రతిపక్ష పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యే లను కెసీఆర్ కొనుగోలు చేయకుడదన్నారు. 2014,2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ,టీడీపీ ,వైసీపీ బీఎస్పీ ,సీపీఐ నుండి గెలిచిన 45 ఎమ్మెల్యే లను ఎంపీలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ జనాలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రెండు సార్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదన్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను, రైతులను ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేశారన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో కర్ణాటక, తెలంగాణలో మంచి రిజల్ట్ వచ్చాయన్నారు.