
కేసీఆర్ ధరణి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ వడ్లు కొనకపోవడంతో.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనకుండా రైతులతో రాజకీయం చేస్తున్నారన్నారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. కేసీఆర్ పాలనలో భూ దోపిడీ ఎక్కువైందన్నారు. వడ్లు కొనడం చేతకాకే కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారన్నారు. చివరి గింజ వరకు కొంటామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. వడ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందేనన్నారు. కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దని..ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 44వ రోజు సూర్యాపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది.