హైదరాబాద్: ఉద్యోగుల జీతాలకు, ఫీజు రీయింబర్స్మెంట్కు, రైతు రుణమాఫీకి డబ్బులు లేవంటున్న కేసీఆర్.. మేఘా కంపెనీకి మాత్రం అప్పులు చేసి మరీ కుమ్మరిస్తారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు 38 వేల కోట్లతో మొదలై.. ప్రస్తుతం లక్షా 20 వలే కోట్లకు చేరిందని ఆమె అన్నారు.
‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు రోజు రోజుకు పెంచుకుంటూ పోతుండు కేసీఆర్ సారు. రూ. 38,500 కోట్లతో మొదలై.. లక్షా 20 వేల కోట్లకు చేరుకొంది. ఒకవైపు.. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు.. ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు.. రైతు రుణమాఫీకి డబ్బులు లేవు.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్ముకోవాలి. కానీ, మేఘా ప్రాజెక్టులకు డబ్బులు కట్టబెట్టడానికి మాత్రం.. అప్పులు చేసి మరి కేసీఆర్ దొర పైసలు కుమ్మరిస్తారు. మీది దేశంలోనే అద్భుత ‘మేఘ’ పరిపాలన దొర గారు’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు .. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు రోజు రోజుకు పెంచుకుంటూ పోతుండు KCR సారు. 38,500 కోట్లతో మొదలై లక్ష 20 వేల కోట్లకు చేరుకొంది. ఒకవైపు .. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు .. 1/2 pic.twitter.com/swzZaR3jSd
— YS Sharmila (@realyssharmila) August 5, 2021