ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌పై వైఎస్ షర్మిల ట్వీట్

ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌పై వైఎస్ షర్మిల ట్వీట్

ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోందంటూ వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. తొమ్మిదేండ్లు కావస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమని, బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవని ఆరోపించారు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నామన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ‘కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం’ అని బీజేపీ లీడర్లు బుకాయిస్తున్నారు కానీ ఎంక్వైరీ చేయడం లేదన్న షర్మిల.. వైఎస్ఆర్టీపీ కాళేశ్వరం అవినీతిపై ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవని మండిపడ్డారు. 

మీ రాజకీయస్వార్థం కోసం తెలంగాణ ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరమని షర్మిల విమర్శించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎదురెళ్లి సమస్యలు పరిష్కరించండి అని నిలదీసే దమ్ము దొర గారికి లేదని, చేతకాని దద్దమ్మలా ఫామ్ హౌజ్ కే పరిమితమై, ప్రధాని వెళ్లిపోయాక అవాకులు, చెవాకులు పేల్చడం సీఎ కేసీఆర్ గారికి అలవాటుగా మారిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. దొర గారి రాజకీయాలు, మొండివైఖరితో తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని చెప్పారు.

https://twitter.com/realyssharmila/status/1644567478901829632