మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కారు డ్రైవర్ ప్రసాద్ భార్య కృప చెప్పారు. వివేకానందరెడ్డి తమ కుటుంబానికి ఎంతో సహాయం చేశారన్నారు. అలాంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.గురువారం రాత్రి 11.45 గంటలకు తన భర్త ఇంటికొచ్చారని చెప్పారు. శుక్రవారం ఉదయం వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు ఫోన్ చేసి సార్ కు బాగాలేదు.. ఇంటి దగ్గరకు వెళ్లాలని చెప్పడంతో వెంటనే వెళ్లాడని ఆమె తెలిపారు. అంతేతప్ప.. లెటర్ కు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారు.