ఇరస్వ జ్యూయలరీ స్టోర్ ఓపెన్

ఇరస్వ జ్యూయలరీ స్టోర్ ఓపెన్

హైదరాబాద్, వెలుగు: ఇరస్వ ఫైన్ జ్యూయలరీ హైదరాబాద్​కు వచ్చింది. సిటీలో సంస్థ మొదటి స్టోర్​ను బాలీవుడ్​ నటి నుస్రత్​ బరూచా ప్రారంభించారు. ఈ స్టోర్​లోని వజ్ర & జెడావ్ నగలు మహిళలను ఎంతో ఆకట్టుకుంటాయని ఇరస్వ తెలిపింది. ఓపెన్ డిజైన్ లేఅవుట్, సమకాలీన ఫకేడ్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలు, ఆభరణాల ప్రదర్శన, జ్యూయలరీ కస్టమైజేషన్​ తమ ప్రత్యేకతలని పేర్కొంది.

ఈ సందర్భంగా ఇరస్వ సీఈఓ కేతన్ పటేల్ మాట్లాడుతూ ఎన్నో రకాల డిజైన్లు, క్వాలిటీ నగలు, సుదీర్ఘ అనుభవం తమ బ్రాండ్​ సొంతమని వివరించారు. తమకు హైదరాబాద్​తోపాటు ముంబై, అహ్మదాబాద్​లో స్టోర్లు ఉన్నాయని, చిన్న నగరాలకూ విస్తరించే ఆలోచన ఉందని అన్నారు. తమ ఎనిమిది ఫ్యాక్టరీల్లో 4,500 మంది పనిచేస్తున్నారని, అమెరికా, యూకే, యూరప్​ డిజైనర్లతో నగలను తయారు చేస్తున్నామని పటేల్​ వివరించారు. ధరలు రూ.35 వేల నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు.