హైదరాబాద్, వెలుగు: ఇరస్వ ఫైన్ జ్యూయలరీ హైదరాబాద్కు వచ్చింది. సిటీలో సంస్థ మొదటి స్టోర్ను బాలీవుడ్ నటి నుస్రత్ బరూచా ప్రారంభించారు. ఈ స్టోర్లోని వజ్ర & జెడావ్ నగలు మహిళలను ఎంతో ఆకట్టుకుంటాయని ఇరస్వ తెలిపింది. ఓపెన్ డిజైన్ లేఅవుట్, సమకాలీన ఫకేడ్ డిస్ప్లేలు, ఆభరణాల ప్రదర్శన, జ్యూయలరీ కస్టమైజేషన్ తమ ప్రత్యేకతలని పేర్కొంది.
ఈ సందర్భంగా ఇరస్వ సీఈఓ కేతన్ పటేల్ మాట్లాడుతూ ఎన్నో రకాల డిజైన్లు, క్వాలిటీ నగలు, సుదీర్ఘ అనుభవం తమ బ్రాండ్ సొంతమని వివరించారు. తమకు హైదరాబాద్తోపాటు ముంబై, అహ్మదాబాద్లో స్టోర్లు ఉన్నాయని, చిన్న నగరాలకూ విస్తరించే ఆలోచన ఉందని అన్నారు. తమ ఎనిమిది ఫ్యాక్టరీల్లో 4,500 మంది పనిచేస్తున్నారని, అమెరికా, యూకే, యూరప్ డిజైనర్లతో నగలను తయారు చేస్తున్నామని పటేల్ వివరించారు. ధరలు రూ.35 వేల నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు.