ఏపీ తెలంగాణలో ఐటీ దాడులు.. రూ.800కోట్ల బ్లాక్ మనీ

ఏపీ తెలంగాణలో ఐటీ దాడులు.. రూ.800కోట్ల బ్లాక్ మనీ

హైదరాబాద్​, వెలుగు: కిందటి వారంలో రియల్​ ఎస్టేట్​, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కంపెనీలపై  జరిపిన దాడులలో రూ. 800 కోట్ల బ్లాక్​మనీ కనుక్కున్నట్లు ఇన్​కంటాక్స్​ డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​లలోని పలు ప్రాంతాలలో  ఈ గ్రూప్​కార్యకలాపాలపై దాడులు జరిపారు. నవ్య డెవలపర్స్​, రాగ మయూరి ఇన్​ఫ్రా, స్కంధాన్షి ఇన్​ఫ్రా కంపెనీలపై గత వారంలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. లెక్కల్లో చూపని రూ. 1.64 కోట్ల క్యాష్​ను దాడులలో స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఐటీ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. బ్లాక్​మనీ దొరక్కుండా ఉండడానికి ఈ కంపెనీలు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్​వేర్​ ఉపయోగించినట్లు ఐటీ డిపార్ట్​మెంట్​ తెలిపింది. ట్రాన్సాక్షన్లు పూర్తయ్యాక డేటా ఆటోమేటిక్​గా మాయం కావడానికి ఈ సాఫ్ట్​వేర్​ వినియోగించినట్లు వివరించింది. రిజిస్ట్రేషన్​ వాల్యూకి మించిన మొత్తాన్ని ఈ కంపెనీలు  కస్టమర్ల నుంచి క్యాష్​ రూపంలో తీసుకుంది. ఇలా వచ్చిన బ్లాక్​మనీని మళ్లీ కొత్త ప్రాపర్టీలు కొనడానికి, ఇతర ఖర్చులకు వెచ్చించినట్లు ఐటీశాఖ వెల్లడించింది.