
- భద్రాద్రికొత్తగూడెం జిల్లా చంచుపల్లిలో టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో ఓ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేశాడు. స్టూడెంట్ తండ్రి ఈరూలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలానికి చెందిన బానోత్ ఈరూలాల్ కొడుకు భరత్(15) చుంచుపల్లిలోని ఎస్ఆర్ డీజీస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. మ్యాథ్య్ హోం వర్క్ చేయలేదని సోమవారం టీచర్ భరత్ను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన భరత్ బుధవారం ఇంటి వద్ద నుంచి స్కూల్కు వెళ్తూ ఎలుకల మందు వెంట తెచ్చుకున్నాడు. స్కూల్ బస్సులో వెళ్తుండగా, వాటర్ బాటిల్లో ఎలుకల మందు కలుపుకొని తాగాడు. వాసన రావడంతో భరత్ను ప్రశ్నించగా, ఎలుకల మందు తాగినట్లు చెప్పాడు.
స్కూల్కు చేరుకోగానే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ తిరుమల్రెడ్డి, టీచర్లకు చెప్పారు. తండ్రికి సమాచారం ఇచ్చిన అనంతరం భరత్ను కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. మెరుగైన ట్రీట్ మెంట్కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం భరత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తండ్రి తెలిపారు. భరత్ ఫీజు కట్టేందుకు మంగళవారం స్కూల్కు వెళ్లానని, తనకు ఈ విషయం తెలియజేస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వాపోయాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఎంఈవో బాలాజీ తెలిపారు. స్కూల్కు వెళ్లి విచారణ చేస్తామని చెప్పారు. ఎంఈవో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఈవో వెంకటాచారి తెలిపారు.