హైదరాబాద్, వెలుగు: అక్టోబర్25 నుంచి ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ఇయర్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మొత్తం 4,59, 228 మంది స్టూడెంట్స్ హాజరు కావాల్సి ఉండగా, 94% మంది ఎగ్జామ్స్కు హాజరయ్యారు. సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్తో మొదలైన పరీక్షలు, మోడర్న్ లాంగ్వేజీ పేపర్–1, జియోగ్రఫీ–1 ఎగ్జామ్స్తో ముగిశాయి. కాగా1,768 సెంటర్లలో ఏ రోజూ కూడా ఒక్క మాల్ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదు. ఇది ఇంటర్ బోర్డు చరిత్రలో రికార్డు అని అధికారులు చెప్తున్నారు. ఈనెల 6 నుంచి ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ మొదలుకానుంది. 6 నుంచి ఫస్ట్ స్పెల్, 8 నుంచి సెకండ్ స్పెల్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో మొత్తం 13 స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, కొత్తగా సిద్దిపేటలో కూడా సెంటర్ పెట్టారు. మెదక్ జిల్లాకు చెందిన క్యాంపును కూడా హైదరాబాద్సిటీ నుంచి రామచంద్రాపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి మార్చారు. మంచిర్యాలలో ఈ ఏడాది కొత్తగా అడిషనల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వాల్యుయేషన్కోసం క్యాంప్ ఆఫీసర్లు, చీఫ్ కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, ఎగ్జామినర్లు, స్ర్కూటినైజర్స్, చీఫ్ ఎగ్జామినర్లను నియమించారు. నవంబర్ నెలాఖరులోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది.