గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కొమరం భీమ్ జిల్లా: తిర్యాని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కరోనా నిబంధనల మేరకు ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రుల భేటీని హాస్టల్ సిబ్బంది రద్దు చేశారు. హాస్టల్ కి వచ్చిన తల్లిదండ్రులను తనతో కలవనీయక పోవడంతో విద్యార్థిని మనస్తాపానికి గురైందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. తిర్యాణి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ లో పురుగుల మందు ఎలా వచ్చిందన్న దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.