
నిర్మల్, వెలుగు: హోం ఐసోలేషన్లో ఉంటూ 97 ఏండ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. నిర్మల్జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్కు చెందిన గంప భగీరథమ్మ(97), కొడుకు, కోడలికి ఇటీవల కరోనా సింప్టమ్స్కనపడడంతో టెస్టులు చేయించుకున్నారు. ముగ్గురికి పాజిటివ్వచ్చింది. ఏరియా హాస్పిటల్డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్తీసుంటూ 17రోజులు ఇంట్లోనే ఉన్నారు. తర్వాత టెస్టులు చేయించుకోగా ముగ్గురికి నెగిటివ్వచ్చింది. కరోనా సోకిందని భయపడకుండా ధైర్యంగా ఉండాలని భగీరథమ్మ చెప్పారు. టైంకు ఫుడ్ తింటూ మెడిసిన్తీసుకుంటే కోలుకుంటారన్నారు.