మేడ్చల్​లో ఎంపీడీఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

మేడ్చల్​లో ఎంపీడీఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు: అక్రమాస్తుల కేసులో మెదక్​ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీఓ జైపాల్​రెడ్డిని అరెస్ట్​ చేసి బుధవారం ఏసీబీ ఫస్ట్​ అడిషనల్ స్పెషల్​ మెజిస్ట్రేట్​ఎదుట హాజరు పరిచినట్టు ఏసీబీ డైరెక్టర్​జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు కంప్లయింట్​ వచ్చిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మనోహరాబాద్ ఎంపీడీఓ ఆఫీస్​తో పాటు, మేడ్చల్​లోని ఎంపీడీఓ ఇంట్లో ఏసీబీ ఆఫీసర్లు సోదాలు చేశారు. ఈ సందర్భంగా జైపాల్​రెడ్డికి సంబంధించి స్థిర, చరాస్తులు, క్యాష్​, జ్యువెల్లరీ కలిపి మొత్తం దాదాపు రూ.3.40 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ డీజీ వెల్లడించారు.