ఎంసీఎంసీ, మీడియా సెంటర్​ పరిశీలన

ఎంసీఎంసీ, మీడియా సెంటర్​ పరిశీలన

మెదక్​టౌన్, వెలుగు: ఎన్నికల నియమావళిలో భాగంగా గురువారం మెదక్​ కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, మీడియా సెంటర్​ను జిల్లా పోలీస్​ పరిశీలకుడు రామేశ్వర్​సింగ్​పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని చెక్​పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డింగ్​ పనితీరును చెక్​ చేశారు. సీ-విజిల్​ యాప్​లో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, ఎస్ఎస్​టీ, ఎఫ్​ఎస్​టీ టీమ్ పనితీరు,  మీడియాలో వచ్చే వార్తలు, పెయిడ్ న్యూస్,  పత్రిక ప్రకటనలు,  ఎలక్ట్రానిక్  మీడియా రికార్డింగ్ పనితీరును ఎంసీఎంసీ నోడల్ అధికారి రామచందర్ రాజును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సీజ్ అయిన డబ్బు, మద్యం, కేసుల వివరాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ బాలస్వామి, అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు,  నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.