కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు బ్రిటన్ ఎగువ సభ(హౌజ్ అఫ్ లార్డ్స్) సభ్యుడిగా గత ఏడాది డిసెంబర్లో నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళవారం మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.
రాష్ట్రం నుంచి బ్రిటీష్ దేశానికి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే స్టూడెంట్స్, ఉద్యోగులకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. మాజీ జడ్సీటీసీ శ్యామల, సర్పంచ్ లక్ష్మయ్య, కాంగ్రెస్ మండల అద్యక్షుడు శెట్టి సుధాకర్, కర్ర రవీందర్ పాల్గొన్నారు.
