కేసీఆర్ ఉద్యమకారులందరినీ కోసి పక్కన పెడుతున్నారు

కేసీఆర్ ఉద్యమకారులందరినీ కోసి పక్కన పెడుతున్నారు
  • బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

కరీంనగర్: సీఎం కేసీఆర్ ఉద్యమకారులందరినీ కోసి పక్కన బెడుతున్నారని, తన నియంతృత్వ, కుటుంబ పాలన సాగించేందుకు ఉద్యమకారులందరినీ బలి పశువులను చేస్తున్నాడని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బుధవారం జమ్మికుంటలో మాజీ మంత్రి ఈటలను కలిశారు ఆయన. ఈ సందర్భంగా ఈటల, వివేక్ వెంకటస్వామి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తన కుటుంబ పాలన సాగించేందుకే ఉద్యమ నాయకుడైన  ఈటల రాజేందర్ ను కూడా బయటకు పంపించారని ఆరోపించారు. కొడుకుకు, అల్లునికి పదవులిచ్చి కుటుంబ పాలన చేస్తున్నాడని ఆయన విమర్శించారు. 
ఈటల రాజీనామా చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ బయటకు వస్తున్నాడని, గతంలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యేవాడని ఆయన గుర్తు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల లక్ష మెజార్టీతో గెలుస్తున్నాడని భయపడి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడని, నిన్న కూడా హుజురాబాద్ మీటింగ్ తర్వాత పడుకోవడానికి ఫామ్ హౌస్ కే పోయాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏడేళ్లుగా కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసమే పనిచేసాడని ఆయన ఆరోపించారు. ఈటలను గెలిపిస్తే ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తాడని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.