ముంబయి: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టై బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే కు ధైర్యముంటే నాపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎక్కడైనా.. ఏ నియోజకవర్గమైనా నాపై పోటీ గెలవాలని సవాల్ చేశారు.
మహారాష్ట్ర సీఎం గుండాలాంటి ఎంపీతో తనను బెదిరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను 20 లోతుల అడుగులో పాతిపెడతానన్న సంజయ్ రౌత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమాన్ చాలీసా చదివితే దేశ ద్రోహమా ? అని ఆమె ప్రశ్నించారు. శివసేన సర్కార్, పోలీసులపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు నవనీత్ కౌర్.
ఇవి కూడా చదవండి
పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై మహిళా నేతల నిరసన