- అనుమతి లేకుండా ఆవులను తరలించొద్దు
- జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి
జూబ్లీహిల్స్, వెలుగు: బక్రీద్సందర్భంగా పశువులను కొనే టైంలో వెటర్నరీ డాక్టర్ల సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, పర్మిషన్లేకుండా పశువులను తరలించవద్దని జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణారెడ్డి సూచించారు. మధురానగర్లోని సాగి రామకృష్ణ కమ్యూనిటీ హాల్లో బుధవారం బక్రీద్ కో ఆర్డినేషన్మీటింగ్నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. చిన్న వయస్సున్న దూడలు, అనారోగ్యంతో ఉన్న పశువులను వధకు తీసుకెళ్లకూడదన్నారు.
రోడ్లపై పశువుల విక్రయాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. అన్ని అనుమతులు ఉండి పశువులను తరలించేప్పుడు ఎవరైనా అడ్డుకుంటే 100కు డయల్ చేయాలన్నారు. వ్యర్థాలను రోడ్లపై వేయకుండా, కవర్లలో సేకరించి జీహెచ్ఎంసి శానిటేషన్ వాహనాల్లో వేయాలని సూచించారు. అడిషనల్డీసీపీ శ్రీకాంత్, జీహెచ్ఎంసీ ఆఫీసర్సురేష్ పాల్గొన్నారు.

