వీణవంక మండలంలో ఈటల రాజేందర్ పర్యటన

వీణవంక మండలంలో ఈటల రాజేందర్ పర్యటన

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలోని పోచమ్మ తల్లి ప్రతిష్టాపన మహహోత్సవంలో బీజేపీ నేత, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. పోచమ్మతల్లికి పూజలు నిర్వహించారు. పూజల తర్వాత అక్కడకు హాజరైన ప్రజలతో ఈటల రాజేందర్ మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా గ్రామానికి వచ్చిన ఈటల రాజేందర్ ను గ్రామస్తులు విజయోస్తు అంటూ శాలువ కప్పి సన్మానించారు. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే ఈటల రాజేందర్ కు పోచమ్మతల్లి అనుగ్రహించి అన్నీ విజయాలే ఇవ్వాలని వారు ఆకాంక్షించారు. 

 

 

ఇవి కూడా చదవండి

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు

సోమ, మంగళవారాల్లో భారత్ బంద్

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు