రాజేంద్రనగర్లో కారు బీభత్సం.. షాపుల్లోకి దూసుకెళ్లింది

రాజేంద్రనగర్లో కారు బీభత్సం.. షాపుల్లోకి దూసుకెళ్లింది

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన హైదర్ గూడలో జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు అదుపు తప్పి అప్టికల్ షాప్ లోకి దూకుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండు షాపులు, ఒక బైకు పాక్షికంగా ధ్వంసమైయ్యాయి. కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. సంఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఎవ్వరు లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

నిర్లక్ష్యంగా కారు నడిపాడని అగ్రహించిన స్థానికులు డ్రైవర్ పై దాడికి యత్నం చేశారు. ఈ క్రమంలో కారు వదలి పారిపోయాడు. మే 18వ తేదీ గురువారం ఉదయం అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చాడు ఆ యువకుడు. మితిమీరిన వేగంతో కారు నడిపి ఆక్సిడెంట్ చేశాడంటున్నారు ప్రత్యేక సాక్షులు. ఈ ప్రమాదం దృశ్యాలు సిసి టీవీ కెమెరాలో రికార్డు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.