చెన్నైలో పలు స్కూల్లో బాంబు పెట్టామని బెదిరింపులు

చెన్నైలో పలు స్కూల్లో బాంబు పెట్టామని బెదిరింపులు

చెన్నైలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో బాంబు పెట్టామంటూ ఈ రోజు (గురువారం)  బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలోని విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపించి స్కూల్స్ మూసివేశారు. చెన్నై నగరంలోని జేజే నగర్, ఆర్ ఎ పురం, అన్నానగర్, గోపాలపురం, పరిమున ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూల్స్ లో బాంబ్ పెట్టామంటూ యాజమాన్యానికి మెయిల్స్ వచ్చాయి. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబ్ స్క్వాడ్ తో పాఠశాలలకు చేరుకొన్న పోలీసులు విద్యార్థులను ఇంటికి పంపించారు.  పోలీసులు బెదరింపుల వెనుక ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. మెయిల్స్ ఎవరు పంపించారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.