
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో తెలంగాణ కేడర్ 2024 బ్యాచ్కు చెందిన శిక్షణ పొందుతున్న ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న ఐఏఎస్ అధికారులు సౌరభ్ శర్మ, సలోని ఛబ్రా, హర్ష చౌదరి, కరోలిన్ చింగ్తియన్మయి, కొయ్యడ ప్రణయ్ కుమార్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్ పర్సన్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ ఉషారాణి ఉన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్లను సీఎం అభినందించి, వారి బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.