జై శ్రీరాం : ఆ రోజు ప్రసాదంగా 45 టన్నుల లడ్డూలు

జై శ్రీరాం : ఆ రోజు ప్రసాదంగా 45 టన్నుల లడ్డూలు

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో పది రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని వారణాసికి చెందిన మిఠాయి తయారీదారులు రామమందిర ప్రారంభోత్సవ వేడుక కోసం 45 టన్నుల లడ్డూలను తయారు చేయనున్నారు. 

స్వచ్ఛమైన దేశీ నెయ్యితో ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు.  ఈ నెల 22న రామ్ లాలాకు ప్రసాదంగా వీటిని అందించనున్నారు. ఈ లడ్డూలను వీరు జనవరి 6 నుండి తయారు చేస్తున్నారు. రోజుకు 1200 కిలోల లడ్డూలను తయారుచేస్తున్నారు. జనవరి 22 లోపు 45 టన్నుల లడ్డూలను తయారు చేయాల్సి ఉంటుంది.  అనంతరం భక్తులుకు వీటిని అందించనునన్నారు.  

 మోదీ దీక్ష 

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఇంకా 10  రోజుల సమయం మత్రమే సమయం ఉంది.  ఈ  క్రమంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. తాను ఈ 11 రోజులు ప్రత్యేక అనుష్ఠానాన్ని (దీక్ష) అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు తన  అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఓ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.  రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించే అవకాశం అవకాశం తనకు రావడం చాలా అదృష్టమని చెప్పుకొచ్చారు.   అయోధ్యలోని రామమందిర ఆలయాన్ని ప్రధాని మోదీ జనవరి 22న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  4 వేల మందికి పైగా సాధువులతో పాటు ఋషులు పాల్గొంటున్నారు.

వారం ముందు నుంచే పూజలు..  

శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజులు ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్  ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. ఇక వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, వసతితో పాటు అవసరమైన సౌలతులు కల్పిస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది బస చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.