కేటీఆర్ భాష విని వీధి రౌడీలు సిగ్గుపడుతున్నరు : మేడిపల్లి సత్యం

కేటీఆర్ భాష విని వీధి రౌడీలు సిగ్గుపడుతున్నరు : మేడిపల్లి సత్యం
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భాష విని వీధి రౌడీలు సిగ్గుపడుతున్నరని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. బుధవారం సీఎల్పీలో  మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న భాషపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికాలో చదివి, ఉద్యోగం చేసి వచ్చిన కేటీఆర్ భాషను విని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. 

కేసీఆర్ తప్పు చేయడంతోనే కాళేశ్వరం  కమిషన్ ఆయన్ను విచారించిందని తెలిపారు. విచారణకు పిలిచి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని కేటీఆర్ బలుపు, అహంకారంతో మాట్లాడుతున్నరని, తెలంగాణ ప్రజలు గుండు కొట్టించి ఫామ్ హౌజ్ కు పంపించినా సిగ్గు రావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ విషయంలో కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు ఆయన వీపును సాఫ్ చేయడం పక్కా అని హెచ్చరించారు.