మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కరోనా పాజిటివ్ గానిర్ధారణ అయిందన్నారు. అయితే ఇంట్లో మిగతా వారందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో డాక్టర్ల సలహాతో చికిత్స తీసుకుంటున్నారు సచిన్ .
తనకు సపోర్ట్ చేస్తున్నడాక్టర్లకు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపారు సచిన్ . అంతేకాదు అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ ట్వీట్ చేశారు