రైతులు అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి

రైతులు అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి

కోటపల్లి, వెలుగు: అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ లో భాగంగా గురువారం కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రం (క్రిడా) శాస్త్రవేత్తలు కోటపల్లి మండలంలోని రాంపూర్, దేవులవాడ గ్రామాల్లోని రైతులతో భేటీ అయ్యారు. 

వ్యవసాయంలో పాటించాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. అధునాతన పద్ధతులతో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో క్రిడా శాస్రవేత్తలు టీవీ ప్రసాద్, బోయిని నరసింహులు, వెంకటేశ్, రెడ్డి, విశ్వ కుమారి, మండల వ్యవసాయ  అధికారి సాయికృష్ణ, ఏఈవో వసుధ పాల్గొన్నారు.