రోడ్డు ప్రమాదంలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి

రోడ్డు ప్రమాదంలో  సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి చెందాడు.  మంగళవారం రాత్రి తొమ్మిదో మైలుతండా - రోళ్ళపాడు క్రాస్ రోడ్ మధ్య కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొని కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో సీఆర్ పీఎఫ్ జవాను మాళోతు జగదీష్ బాబు (30) మృతి చెందాడు. టేకులపల్లి మండలం మద్రాసుతండాకు చెందిన జగదీష్ చెన్నై లో సీఆర్ పీఎఫ్ జవాన్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవు పై ఇంటికి వచ్చాడు.ఆయనకు భార్య పుష్పలత, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.