గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని: కాకా మనవడు వంశీ కృష్ణ ను పెద్దపల్లి ఎంపీ గా గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరిఖని ని కేసీఆర్ బొందల గడ్డ చేశాడని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న బీజేపీ కి వంతపాడుతున్నారని మాజీ సీఎంపై ఫైర్ అయ్యారు. 

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లను భూస్థాపితం చేసి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోకి కోతులు వస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి పారిపోతాయని ఎద్దేవా చేశారు.