ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని: ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తాను సొంతంగా సోలార్ బైక్ కంపెనీ ఏర్పాటు చేసి 500 మంది యువతకు ఉద్యోగ అవకాశా లు కల్పించానని.. అందులో సింగరేణి కార్మికుల పిల్లలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ అనిల్ కుమార్ తో కలిసి రామగుండం లయన్స్ క్లబ్ మెంబర్ను ఆయన కలిశారు. 

ఈసందర్భం గా వంశీ కృష్ణ మాట్లాడుతూ 'విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతు న్నం కేవలం ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి మీ ముందుకు వచ్చా. ఎంపీగా వివేక్ వెంకట స్వామి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తీసుకువస్తే.. అందులో బీఆర్ఎస్ నాయకులు ఉద్యోగాలను అమ్ముకున్నరు. పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడతాను' అని అన్నారు.