
బీజింగ్: కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో మరో సిటీలోనూ చైనా లాక్డౌన్ పెట్టింది. దాదాపు 45 లక్షల మంది జనాభా ఉన్న క్సియామెన్ సిటీలో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులను బంద్ పెట్టింది. ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఆగే కాంప్లెక్స్ను క్లోజ్ చేసింది. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో ఇతర సిటీలకు వైరస్ పాకకుండా చర్యలు తీసుకుంది. ఫుజియాన్ ప్రావిన్స్లోని క్సియామెన్ సిటీ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి కేంద్రం.. ఏబీబీ లిమిటెడ్ సహా పేరొందిన కంపెనీలకు సెంటర్. ఈ సిటీలో ఇప్పటి వరకు డెల్టా వేరియంట్ కరోనా కేసులు 59 బయటపడ్డాయని అధికారులు చెప్పారు. వీటితో ఫుజియాన్ ప్రావిన్స్లో మొత్తం డెల్టా కేసులు 103 కు చేరాయని వివరించారు. దీంతో ఎమర్జెన్సీ టైమ్లోనే బయటకు రావాలని అధికారులు ఆంక్షలు పెట్టారు.