ఏ యూనియన్లోనూ చేరవద్దట..
చోద్యం చూస్తున్న సింగరేణి మేనేజ్మెంట్
మంచిర్యాల, వెలుగు: జైపూర్సింగరేణి థర్మల్పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) వర్కర్లు పోలీస్ఎన్వోసీ సమర్పించి గేట్పాస్లు రెన్యువల్ చేసుకోవాలని సీఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ఇటీవల ఆర్డర్స్జారీ చేసింది. దీంతో కార్మికులు రామగుండం పోలీస్ కమిషనరేట్ బాట పడుతున్నారు. గత ఐదేళ్లలో అడగని ఎన్వోసీలు ఇప్పుడు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీనివెనుక కార్మికుల హక్కులను హరించే కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో 2016లో ఎస్టీపీపీని ప్రారంభించారు. ప్లాంట్ ఆపరేషన్స్తో పాటు పలు డిపార్ట్మెంట్లను ప్రైవేట్ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో ల్యాండ్లూజర్స్, లోకల్స్తో పాటు నాన్ లోకల్స్కు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్జాబ్స్ కల్పించారు. అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి సుమారు 1,500 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. కొద్దిరోజుల కిందటి వరకు సింగరేణికి చెందిన సర్వీసెస్ అండ్ ప్రొటెక్షన్ కార్ప్స్(ఎస్ అండ్ పీసీ) ఎస్టీపీపీ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించింది. ఈ సంస్థ ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డులకు మినహా ఇతర కార్మికులకు కాంట్రాక్ట్కంపెనీ జారీ చేసిన ఐడెంటిటీ కార్డు, ఆధార్కార్డు చూపిస్తే గేట్పాస్లు జారీ చేసేవారు. ఎస్అండ్పీసీని రద్దు చేసిన తర్వాత సెంట్రల్ ఇండస్ర్టియల్సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు అప్పగించారు. ఈ సంస్థ రూల్స్ ప్రకారం గేట్పాస్ల జారీ, రెన్యువల్ కోసం పోలీస్ఎన్వోసీ తప్పనిసరి అని చెప్తున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్వోసీలు తెచ్చి పాస్లు రెన్యువల్ చేసుకోవాలని ఆర్డర్స్ జారీ చేశారు.
కార్మికులపైనే ఎన్వోసీ భారం
ఏదైనా కంపెనీలో పనిచేసే కాంట్రాక్ట్వర్కర్లకు పోలీస్ఎన్వోసీలు అవసరమైతే సంబంధిత ఏజెన్సీయే కార్మికుల పేర్లను పోలీసులకు పంపించి ఎన్వోసీలు తీసుకుంటుంది. అందుకయ్యే చార్జీలను కూడా ఆ సంస్థలే భరించుకుంటాయి. ప్రస్తుతం ఎస్టీపీపీలో దీనికి భిన్నంగా జరుగుతోంది. కార్మికులే ఎన్వోసీలు తెచ్చుకోవాలని చెప్పి ఈ నెలాఖరు వరకు డెడ్లైన్ పెట్టడంతో ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందటి వరకు లోకల్పోలీస్స్టేషన్లలోనే ఎన్వోసీలు జారీ చేశారు. ఇప్పటికే కొంతమంది జైపూర్, ఇతర పోలీస్స్టేషన్లనుంచి తీసుకున్నారు. కానీ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారికి జిల్లా ఎస్పీ లేదా కమిషనరేట్నుంచి ఎన్వోసీలు జారీ చేయాలనే రూల్ఉంది. దీంతో ఎస్టీపీపీ వర్కర్లు రామగుండం కమిషనరేట్కు వెళ్తున్నారు. రోజూ సుమారు 50 మంది ఎన్వోసీల కోసం వస్తున్నట్టు అక్కడి ఆఫీసర్లు చెప్పారు. ఎన్వోసీ కోసం వెయ్యి రూపాయల డీడీ తీసి కమిషనరేట్లో అప్లై చేసుకోవాలి. స్పెషల్బ్రాంచ్(ఎస్బీ) పోలీసులు సంబంధిత వ్యక్తులపై దేశవ్యాప్తంగా ఎక్కడైనా కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేసి రిపోర్టు అందజేస్తారు. దాని ప్రకారం పోలీస్కమిషనర్ఎన్వోసీలు జారీ చేస్తారు. ఈ తతంగం పూర్తికావడానికి కనీసం పది పదిహేను రోజులు అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. ఈలోగా కార్మికులు మూడు నాలుగుసార్లు కమిషనరేట్కు వెళ్తున్నారు. దీంతో డ్యూటీలు కోల్పోతున్నామని పేర్కొంటున్నారు. అంతా కలిపి రెండు వేలకు పైగా ఖర్చవుతోందని చెప్తున్నారు.
ఇప్పుడే ఎందుకు?
ఎన్వోసీ అడగడంపై కార్మికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ వింగ్లో మినహా ఇతర డిపార్ట్మెంట్లలోని కార్మికులకు రిక్రూట్మెంట్ టైంలో కూడా ఎన్వోసీలు అడగలేదని అంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్లకు కనీస వేతనాలు సైతం ఇవ్వడం లేదని, ఐదేళ్ల కిందట రూ.300 డెయిలీ వేజ్పై చేరినవారికి ఇప్పుడు రూ.420 మించి చెల్లించడం లేదని అంటున్నారు. దీనిపై కార్మికులు ప్రశ్నిస్తుండడంతో ఎన్వోసీలు అడుగుతున్నారని పేర్కొంటున్నారు. కార్మికులు ఏ యూనియన్లోనూ చేరకుండా, అలాగే కేసులు ఉన్నవారిని తొలగించి వాళ్ల స్థానంలో పైసలు తీసుకొని కొత్తవారిని నియమించుకోవాలనే కుట్ర ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సింగరేణి మేనేజ్మెంట్ స్పందించాలని కోరుతున్నారు.