అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జన్నారం, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన బాదవత్ శ్రీనివాస్(30) ​తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరంతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. రెండేండ్లుగా దిగుబడి సరిగ్గా రాలేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ. 2 లక్షలు ఎలా తీర్చాలన్న ఆందోళనతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబసభ్యులు లక్సెట్టిపేట హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు కొడుకులున్నారు.