పెండింగ్ బిల్లులు చెల్లించాకే ఎలక్షన్లు పెట్టాలి

పెండింగ్ బిల్లులు చెల్లించాకే ఎలక్షన్లు పెట్టాలి
  • మాజీ సర్పంచ్​ల సంఘం జేఏసీ డిమాండ్​
  • పంచాయతీరాజ్ కమిషనర్  కార్యాలయం గేటుకు వినతి పత్రంతో ముడుపు 
  • మంత్రి పొన్నం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వినతి

హైదరాబాద్, వెలుగు: పెండింగ్​ బిల్లులు చెల్లించా కే సర్పంచ్​ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచ్ ల సంఘం జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. పెండిం గ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచ్​ల సంఘం జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో శనివారం వినూత్న నిరసన తెలిపారు. ఖైరతాబాద్​లోని పం చాయతీ రాజ్​ కమిషనర్​ కార్యాలయం గేటుకు వినతి పత్రంతో ముడుపు కట్టి నిరసన తెలిపారు.

 పెండింగ్​ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభా కర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్​ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్​ల పెండింగ్ బిల్లులు మంజూరు కోసం అనేకసార్లు శాంతియుతంగా వివిధ కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 

బిల్లులురాక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఎంతో మంది సర్పంచ్​లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్  బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, కేశబోయిన మల్లయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.