
- మాజీ సర్పంచ్ల సంఘం జేఏసీ డిమాండ్
- పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం గేటుకు వినతి పత్రంతో ముడుపు
- మంత్రి పొన్నం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వినతి
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించా కే సర్పంచ్ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచ్ ల సంఘం జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. పెండిం గ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శనివారం వినూత్న నిరసన తెలిపారు. ఖైరతాబాద్లోని పం చాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం గేటుకు వినతి పత్రంతో ముడుపు కట్టి నిరసన తెలిపారు.
పెండింగ్ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభా కర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు మంజూరు కోసం అనేకసార్లు శాంతియుతంగా వివిధ కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
బిల్లులురాక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఎంతో మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, కేశబోయిన మల్లయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.