కోడెదూడకు లాంఛనంగా అంత్యక్రియలు

కోడెదూడకు లాంఛనంగా అంత్యక్రియలు

భద్రాచలం,వెలుగు :  భద్రాచలంలోని బస్టాండ్ ఎదురుగా శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని  ఓ కోడె దూడ చనిపోయింది. గ్రామ పంచాయతీ ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో పట్టణ బీజేపీ లీడర్లు యర్రంరాజు బెహరా, నాగబాబు, గోమాత సంరక్షణ కమిటీ కలిసి కళేబరాన్ని పంచాయతీ ట్రాక్టర్ పై గోదావరి ఒడ్డుకు తీసుకువెళ్లారు. అక్కడ ఇసుకలో గొయ్యి తీయించి లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించారు.