బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?

బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?
  •   ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు​ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారని, వాళ్లు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. వారిపై అవినీతి, పరువు నష్టం, ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. పరువు నష్టం కేసులో రెండేండ్ల జైలు శిక్ష పడితే రాహుల్ బెయిల్ మీద బయటకొచ్చారని చెప్పారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా బెయిల్ మీద ఉన్నారన్నారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక కేసుల్లో బెయిల్​పై బయట తిరుగుతున్నారన్నారు. ఆ కేసుల్లో వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.5 లక్షల ష్యూరిటీ తీసుకుని ఆయన బయటకొచ్చారన్నారు.