ఉత్తరప్రదేశ్​లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతది: అఖిలేశ్ యాదవ్

ఉత్తరప్రదేశ్​లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతది: అఖిలేశ్ యాదవ్

బుదౌన్: మూడో దశ పోలింగ్‌‌‌‌లో ఉత్తరప్రదేశ్‌‌‌‌ నుంచి బీజేపీ పూర్తిగా వాష్ అవుట్ అవుతుందని సమాజ్‌‌‌‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆ పార్టీ సమాజంలోని అన్ని వర్గాలకు ఫేక్ మాటలు చెప్పడం, తప్పుడు వాగ్దానాలు చేయడం తప్ప ఇంకేం చేయలేదన్నారు. ఆదాయం రెండింతలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రైతులకు మేలు చేసేలా ఎంఎస్పీ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శనివారం బుదౌన్ లోక్‌‌‌‌సభ స్థానం పరిధిలోని నాధా టౌన్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మే 7న జరగనున్న మూడో ఫేజ్ ఎన్నికల్లో రైతులు, సామాన్య పౌరులు బీజేపీని యూపీ నుంచి ఏడు మైళ్ల దూరం తరిమికొడతారని చెప్పారు.