కట్నం కోసం వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య

కట్నం కోసం వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య

జైపూర్(భీమారం), వెలుగు: కట్నం కోసం వేధించడంతో గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నూరు మండలం, ఒత్కులపల్లి గ్రామానికి చెందిన జుమ్మిడి లక్ష్మి– రాజమల్లు కూతురు రమ్య ఉరఫ్​లత (24) ను పదహారు నెలల క్రితం భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్​కు ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు రూ. 2 లక్షలు కట్నం, బంగారం, ఒత్కులపల్లిలో 18 గుంటల భూమి ఇచ్చారు. కొన్ని నెలలుగా భూమిని అమ్మి డబ్బులు తీసుకు రావాలని, కల్యాణ లక్ష్మి పైసలు ఇవ్వాలని  అత్తింటి వారు వేధిస్తున్నారు. మానసిక వేదనకు గురైన లత గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న భర్త కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. అక్కడి నుంచి మరో ప్రైవేట్ హాస్పిటల్​కు తరలిస్తుండగా చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అత్త మామలు శేషమ్మ,భూమయ్య, భర్త రాజశేఖర్, మరిది రాకేశ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపి నరేందర్ తెలిపారు.