
హైదరాబాద్, వెలుగు: టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తనపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసును కొట్టేయాలని, దర్యాప్తుపై స్టే విధించా లని హైకోర్టును బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ య్ కోరారు. ఆ పిటిషన్ను శుక్రవారం హైకోర్టు విచారించి.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వానికి, కమ లాపురం హెడ్మాస్టర్లకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూ యాన్ నోటీసులు జారీ చేశారు. సంజయ్ తర ఫు అడ్వకేట్ ఎల్.రవిచందర్ వాదిస్తూ, పరీక్ష స్టార్ట్ అయ్యాక పేపర్ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన హెడ్మాస్టర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సంజయ్పై ఫిర్యాదు చేసేందుకు మాత్రం ఎనలేని ఆసక్తి చూపారన్నారు.
సంజయ్పై పెట్టిన కేసును కొట్టేయాల ని, ఈలోగా ఆయనపై పోలీసులు కఠిన చర్య లు తీసుకోకుండా ఉత్తర్వులివ్వాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. సీఆర్పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయకుండా పోలీసులు ఏకపక్షంగా అరెస్టు చేశారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను ఉల్లంఘించి సంజయ్ని అరెస్టు చేశారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, సంజయ్ని పోలీసులు అరెస్టు చేశాక టెన్త్ పేపర్ల లీకేజీ జరగలేదన్నారు. లీకేజీలో సంజయ్కి కీలకపాత్ర ఉందని, పేపర్ లీకేజీ వివరాలు ఇతరులకు ఫోన్ ద్వారా పంపారన్నారు. సంజయ్ తన సెల్ఫోన్ పోలీసులకు ఇవ్వలేదని, దర్యాప్తునకు కూడా సహకరించడం లేదని, స్టే ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం విచా రణ జూన్ 16కి వాయిదా పడింది.