తీన్మార్ మల్లన్న పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

తీన్మార్ మల్లన్న పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వేసిన పిటిషన్ పై వెంటనే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇవాళ(మంగళవారం) మల్లన్న వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇటీవల తీన్మార్ మల్లన్న ఆఫీసులపై పోలీసులు దాడులు చేసి, పలు హార్డ్ డిస్క్ లను తీస్కెళ్లారు. ఆ తర్వాత రోజు సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ క్రమంలోనే తనను పోలీసులు వేధిస్తున్నారని, కారణాల్లేకుండా పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారని తెలుపుతూ హైకోర్టులో మల్లన్న పిటిషన్ వేశారు.

అంతేకాదు CCS, చిలకలగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని పిటిషన్ లో తెలిపారు. పదే పదే తనను స్టేషన్ కు పిలవకుండా ఆన్ లైన్ లోనే దర్యాప్తు చేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోరారు.