న్యాయాన్ని గెలిపించడమే హైడ్రా లక్ష్యం

న్యాయాన్ని గెలిపించడమే హైడ్రా లక్ష్యం
  • హైడ్రా ఉద్దేశం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది
  • తెలుగు రత్న అవార్డు ప్రదానంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్​

బషీర్​బాగ్, వెలుగు: న్యాయాన్ని గెలిపించడమే హైడ్రా లక్ష్యమని.. అందరికీ హైడ్రా ఉద్దేశం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందని కమిషనర్​రంగనాథ్​చెప్పారు. ఉగాది పండుగను పురస్కరించుకుని సైఫాబాద్​లోని ఓకే టీవి ఆధ్వర్యంలో సోమవారం ‘తెలుగు రత్న’ పేరుతో అవార్డులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, కమిషనర్​రంగనాథ్​పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాథ్​మాట్లాడుతూ.. హైడ్రా కమిషర్​గా బాధ్యతలు చేపట్టాక ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 

నల్లగొండ ఎస్పీగా ఉన్న టైంలో ప్రణయ్ హత్య కేసు విషయంలోనూ ఎన్నో మాటలు పడ్డానని చెప్పారు. ఆలస్యం అయినా ఇటీవల ఆ కేసులో వచ్చిన తీర్పు తన పనితీరుకు నిదర్శనం అన్నారు. హైడ్రా కూడా త్వరలోనే సిటీ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలుకు రంగనాథ్​అవార్డు అందజేశారు.