పాతబస్తీలోని ఓ ఏటీఎం నుంచి నోట్ల వర్షం కురుస్తోంది. మొహల్పురాలోని ఇష్రత్ మహల్లో ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రూ.500 కొడితే రూ.2,500 వస్తున్నాయి. దీంతో ఏటీఎం దగ్గర జనాలు భారీగా క్యూ కట్టారు. ఏటీఎం నుంచి రూ.500 కొట్టి రూ.2,500 పట్టుకెళ్తున్నారు.
హరిబౌలి చౌరస్తాలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వార్త విన్న జనం ఏటీఎం వద్దకు భారీగా తరలివచ్చారు. అక్కడ గందరగోళం చోటు చేసుకోవడంతో.. స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏటీఎంకు తాళం వేసి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు.