- ఇండియా ఓపెన్కు దూరం
- టాప్ సీడ్స్గా సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్, తెలుగు ఆటగాడు బి. సాయి ప్రణీత్ కరోనా పాజిటివ్గా తేలాడు. దాంతో, మంగళవారం మొదలయ్యే మొదలయ్యే సీజన్ స్టార్టింగ్ టోర్నీ ఇండియా ఓపెన్ నుంచి విత్డ్రా అయ్యాడు. ‘ఆర్టీపీసీఆర్ టెస్టులో నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. నిన్నటి నుంచి కొంచెం జలుపు, దగ్గు ఉంది. ఇంట్లోనే ఐసోలేట్ అయ్యా. వారం తర్వాత మళ్లీ టెస్టు చేసుకుంటా. ఈ ఏడాది నాకు చాలా ముఖ్యం. ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకునేందుకు చాలా తక్కువ టైమ్ ఉంది. తొందర్లోనే కోర్టులోకి తిరిగొస్తానని అనుకుంటున్నా’ అని ప్రణీత్ చెప్పాడు.
ప్రణీత్తో పాటు పాజిటివ్గా తేలిన డబుల్స్ స్పెషలిస్ట్ ధ్రువ్ రావత్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కాగా, రెండేళ్ల బ్రేక్ తర్వాత రీస్టార్ట్ అవుతున్న ఇండియా ఓపెన్లో మాజీ చాంపియన్స్, స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ టాప్ సీడ్స్గా బరిలోకి దిగుతున్నారు. విమెన్స్ సింగిల్స్లో సింధుకు, మెన్స్ సింగిల్స్లో శ్రీకాంత్కు టాప్ సీడింగ్ దక్కింది. ఓవరాల్గా ఐదు కేటగిరీల్లో 19 దేశాల ప్లేయర్లు ఈ టోర్నీ బరిలో నిలిచారు.