రెండో టెస్టుకు టీమిండియాలో స్వల్ప మార్పు

రెండో టెస్టుకు టీమిండియాలో స్వల్ప మార్పు

శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టులో చిన్న మార్పు జరిగింది. పింక్ బాల్ టెస్టు కు లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. బెంగళూరు వేదికగా ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు రెండో టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా టూర్ కు.. వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ల నుంచి గాయం కారణంగా అక్షర్ పటేల్ దూరమయ్యాడు. 
చికిత్స అనంతరం వైద్యుల సూచనతో విశ్రాంతి తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగొచ్చిన అక్షర్ పటేల్ నెట్ ప్రాక్టీస్ లో తీవ్రంగా శ్రమిస్తూ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. మొదటి టెస్టుకే అక్షర్ పటేల్ ను తీసుకోవాలనుకున్నా... కొన్ని సమీకరణాలతో పక్కన పెట్టిన సెలెక్టర్లు.. రెండో టెస్టు పింక్ బాల్ తో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫుల్ జోష్ మీద ఉన్న అక్షర్ పటేల్ కు రెండో టెస్టులో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో అక్షర్ పటేల్ చివరి సారిగా టెస్టు ఆడాడు. 
 

ఇవి కూడా చదవండి